Shuru
Apke Nagar Ki App…
దుబ్బాకలో గస్తీకి చాయ్తో ప్రోత్సాహం – ప్రజల చొరవను మెచ్చిన ఎస్సై కళ్యాణి నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో నిన్న అర్ధరాత్రి విశేషమైన దృశ్యం కనిపించింది. గ్రామంలో ఇటీవల దొంగతనాల నివారణకు గ్రామస్థులే రాత్రివేళ గస్తీ కాస్తుండగా, పెట్రోలింగ్ లో భాగంగా గ్రామానికి వచ్చిన ఎస్సై ఎం.కళ్యాణి వారికి చాయ్ అందిస్తూ ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – “నేరాల నియంత్రణలో పోలీసులకు ప్రజల సహకారం చాలా అవసరం. ఇటువంటి ప్రజా భాగస్వామ్యం శాంతి భద్రతల పరిరక్షణకు దోహదపడుతుంది” అని పేర్కొన్నారు. గ్రామ ప్రజల చొరవను మెచ్చుకున్న ఎస్సై , ఇతర గ్రామాల్లో కూడా ఇదే తరహా గస్తీ పద్ధతిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల నుండి ఇలాంటి మద్దతు రావడం పట్ల పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
RR
RC REDDY
దుబ్బాకలో గస్తీకి చాయ్తో ప్రోత్సాహం – ప్రజల చొరవను మెచ్చిన ఎస్సై కళ్యాణి నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో నిన్న అర్ధరాత్రి విశేషమైన దృశ్యం కనిపించింది. గ్రామంలో ఇటీవల దొంగతనాల నివారణకు గ్రామస్థులే రాత్రివేళ గస్తీ కాస్తుండగా, పెట్రోలింగ్ లో భాగంగా గ్రామానికి వచ్చిన ఎస్సై ఎం.కళ్యాణి వారికి చాయ్ అందిస్తూ ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – “నేరాల నియంత్రణలో పోలీసులకు ప్రజల సహకారం చాలా అవసరం. ఇటువంటి ప్రజా భాగస్వామ్యం శాంతి భద్రతల పరిరక్షణకు దోహదపడుతుంది” అని పేర్కొన్నారు. గ్రామ ప్రజల చొరవను మెచ్చుకున్న ఎస్సై , ఇతర గ్రామాల్లో కూడా ఇదే తరహా గస్తీ పద్ధతిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల నుండి ఇలాంటి మద్దతు రావడం పట్ల పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
More news from Telangana and nearby areas
- Post by Ravi Poreddy1
- నల్లగొండ జిల్లా : • నార్కట్ పల్లి మండలం ఔరావాణి గ్రామంలో వింత ఘటన.. • మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బియార్యేస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కల్లూరి బాలరాజు ఒడిపోవడంతో దేవుని ఫోటో తో తను, తన భార్య పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇల్లు ఇల్లు తిరుగుతూ ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలనిఅభ్యర్ధన. • బియార్యేస్ అభ్యర్ధిపై 448 ఓట్లతో జక్కిలి పరమేష్ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపు. • గ్రామంలో 1577 ఓట్ల ఉండగా 1494 ఓట్లు పోలైనవి.1
- Post by KLakshmi Devi2
- Post by Omnamashivaya S1
- తెర్లం మండలం కె. సీతారాం పురం లో 10 పురిల్లు దగ్ధం.... మంటలలో చిక్కుకున్న వృద్ధు రాలు సజీవ దహనం......2
- *ముష్టితో మానవత్వం చాటుతున్న పీలేరు ప్రజలు* *సాక్ష్యంగా నిలుస్తున్న అధికారులు* పీలేరు : ఆడుకోవాల్సిన వయసులో ఆదుకోవాలని వేడుకోలు 🙏🙏, అ ఆ లు రాయాల్సిన చేతులో ఆకలి కేకలు, బాధ్యతగా ఉండాల్సిన తల్లిదండ్రులు బాద్యులు 😡, ఇలా ఒక్కటి ఏమిటి చెప్పుకుంటూ పొతే చాలానే మనచుట్టూ ఉన్నాయి. అవేమి మనకు పట్టదు, అధికారులకు అసలు పట్టదు. పీలేరులో పసిబిడ్డలను అడుకోవడానికి పంపి వాళ్ళు తెచ్చిన సొమ్ముతో వారి తల్లిదండ్రులు విలాసంగా బ్రతుకుతున్నారు. పిల్లలని కని నడిరోడ్డుపై వదిలేస్తున్నారు. ఇలా ఒక పక్క ఆకలితో మరో పక్క ఇంటికి వెళితే తల్లిదండ్రులు ఏమంటారో తెలియని పసిబిడ్డలు చేయి చాచి అడుకుంటున్నారు.స్థానికులు సైతం పట్టించుకొనే తీరిక లేక వారి మానవత్వాన్ని ఒకటి లేదా రెండు రూపాయలతో సరిపెట్టుకుంటున్నారు. ఇక ప్రభుత్వ చట్టాలు, కోర్టు ఆదేశాలు ఇవన్నీ పక్కన పెట్టి AC కారుల్లో అధికారులు విలాసంగా వున్నారు. ఇక పిల్లల గురించి ఆలోచించే మనిషి పీలేరులో లేకపోవడం పసిబిడ్డల పాలిట శాపంగా మారింది. కనీసం జిల్లా పాలనాధికారి అయినా ద్రుష్టి పెడతారా అంటే అదీలేదు ఎందుకంటే IAS స్థాయి వేరే, వాళ్ళు మాట్లాడే బాష, వాళ్ళు కలుసుకొనే మనుషులు, వాళ్ళు చేసే పనులు ఇలా అన్నీ ఒక రెంజుల్లో ఉంటాయి. సమాజం గురించి పట్టించుకొనేది లేనప్పుడు సమాజంలో గొప్పలు చెప్పుకోవడం ఎందుకు, పసిబిడ్డలను కాపాడలేనప్పుడు సొంత బిడ్డలు ఎందుకు.ఇలా ఆలోచిస్తే తలదించుకోవాల్సిన పరిస్థితి అందరి మీద ఉంది. #annamayyacollector #piller #beggar's #ANNAMAYYANEWS2
- నరసన్నపేట: ప్రశాంతంగా ప్రారంభమైన ఏపీ ఉపాధ్యాయ టెట్ పరీక్షలు నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 8:30కే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. డిపార్ట్మెంటల్ అధికారి పేడాడ దాలినాయుడు పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 640 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.1
- Post by Omnamashivaya S1