Shuru
Apke Nagar Ki App…
ఆర్టీసీ బస్టాండులో కుక్కల బెడద జన్నారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో పర్యవేక్షణ లోపంతో కుక్కలకు అడ్డాగా మారింది. జన్నారం బస్టాండ్ లో కంట్రోలర్ లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది. దీంతో వీధి కుక్కలు బస్టాండ్ వద్ద మార్చుకుని నిద్రిస్తున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్త చేశారు. కంట్రోలర్ లేకపోవడంతో బస్సుల సమయ వేళలు తెలియడం లేదని, వీధి కుక్కలు ఉండటంతో బస్టాండ్ లో ఉండేందుకు భయం ఏర్పడుతుందని, ఇప్పటికైనా కంట్రోలర్ నియమించాలన్నారు.
Gourinatha p.g
ఆర్టీసీ బస్టాండులో కుక్కల బెడద జన్నారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో పర్యవేక్షణ లోపంతో కుక్కలకు అడ్డాగా మారింది. జన్నారం బస్టాండ్ లో కంట్రోలర్ లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది. దీంతో వీధి కుక్కలు బస్టాండ్ వద్ద మార్చుకుని నిద్రిస్తున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్త చేశారు. కంట్రోలర్ లేకపోవడంతో బస్సుల సమయ వేళలు తెలియడం లేదని, వీధి కుక్కలు ఉండటంతో బస్టాండ్ లో ఉండేందుకు భయం ఏర్పడుతుందని, ఇప్పటికైనా కంట్రోలర్ నియమించాలన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- సూర్యాపేట: అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలం ఎల్లతీస్తున్నారని, ఆరోపణలు కాకుండా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జివివి గార్డెన్ లో జరిగిన సిపిఐ (ఎం )సూర్యాపేట జిల్లా విస్తృత సాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంలో రెండు ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేశాయని ఆరోపించారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా 32వేల ఓట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందన్నారు. ఇంకా 42 వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. 4, ఎకరాలు భూ సేకరణ, కాలువల నిర్మాణం, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. బీసీలకు42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల విషయంలో వివక్షత లేకుండా అర్హులైన వారందరికీ అక్రిడిషన్స్ కార్డులు ఇవ్వాలన్నారు. ఏ ఒక్క జర్నలిస్టుకు నష్టం కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్న నేటికీ ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా అర్హులైన పేదలందరికీ ఇవ్వాలన్నారు. మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పిన హామీ కూడా అమలు కాలేదు అన్నారు. పాత పద్ధతిలో ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి విబి జీరాంజి పేరు పెట్టడం మహాత్ముని అవమానించడమేనని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టానికి 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా బిల్లులో మార్పు తీసుకురాటం మూలంగా60 శాతం కేంద్ర ప్రభుత్వం,40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పడం అర్థం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలపైన భారం కలిగించే ఈ చర్యలను వెంటనే వెనుక తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో లక్షల మంది ఉపాధి హామీ ద్వారా ఉపాధి పొందుతున్నారని, వారి నోటిలో మట్టి కొట్టి విధంగా ఇలాంటి చర్యలకు పాల్పడడం సమంజసం కాదన్నారు. యూరియా బుక్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పడం మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యాప్ డౌన్లోడ్ కాక పోవడంతో రైతులు యూరియాను బుక్ చేసుకోలేక పోతున్నారని అన్నారు. అనేకమంది గిరిజనులు, నిరక్షరాశులయిన రైతులు యాప్ ద్వారా యూరియా పొందటం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం తక్షణమే పాత పద్ధతిలో యూరియాను అందించాలని కోరారు. ఇప్పటికే గ్రామాలలో యూరియా కొరత ఉందని, ప్రభుత్వం తక్షణమే రైతాంగానికి కావాల్సిన యూరియాను అందుబాటులో ఉంచాలన్నారు. *ప్రశ్నించే గొంతు నొక్కుతున్న కేంద్ర ప్రభుత్వం....* *సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి* కేంద్రంలో మూడవసారి అధికారంలోకొచ్చిన బిజెపి ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కుతూ అప్రజా స్వామీక పరిపాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేస్తున్న మతోన్మాద చర్యలను ప్రశ్నించిన వారిపై దాడులు, అక్రమ కేసులు, ఎన్కౌంటర్ల ద్వారా అణిచివేస్తుందన్నారు. ఇటీవల సామాజిక కార్యకర్త అనాధాశ్రమం నిర్వాహకులు మాజీ మావోయిస్టు గాదే ఇన్నయ్యను ఎన్ ఐ ఏ అధికారులు అక్రమం పద్ధతిలో అరెస్టు చేశారని ఈ అరెస్టును తీవ్రంగాఖండిస్తున్నామన్నారు. సామాజిక సమస్యలపై స్పందించే వ్యక్తులను అరెస్టు చేయడం, బావ వక్రీకరణ స్వేచ్ఛపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. ప్రజాస్వామిక వాదులందరూ ఈ అరెస్టును ఖండించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలిందన్నారు. గ్రామీణ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని ఆ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేసి గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు మద్యం, డబ్బు విచ్చలవిడిగా కుమ్మరించి గెలిచాయన్నారు. ఎన్నికల్లో ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన ప్రజలు సిపిఐ (ఎం) కు అత్యధికంగా ఓట్లేసి గెలిపించారని వారికి సిపిఐ (ఎం )పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభానికి ముందు ప్రారంభ సూచికంగా సిపిఐ (ఎం )పతాకాన్ని సిపిఐ (ఎం) సీనియర్ నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నూతనంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు ఘనంగా సన్మానించారు. సిపిఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ విస్తృత స్థాయి సమావేశంలో సిపిఐ (ఎం )రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, పారేపల్లి శేఖర్ రావు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, వివిధ మండలాల కార్యదర్శిలు, ప్రజా సంఘాల జిల్లా నాయకులుతదితరులు పాల్గొన్నారు.1
- అల్లూరి జిల్లా హుకుంపేట మండలం మజ్జివలస పరిసర ప్రాంతాల్లో హైడ్రోపోవర్ ప్రాజెక్టు నిర్మాణంపై వ్యతిరేకిస్తున్న గిరిజన గ్రామాలు ఈ కార్యక్రమంలో సిపిఐ జెడ్పిటిసి గారు దిసారి గంగరాజు అలాగే ప్రజా సంఘాలు మద్దతు పలుకుతూ వెంటనే ప్రాజెక్ట్ ఆపేయాలని లేనిపక్షంగా తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమం ప్రజా సంఘ ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు1
- కర్నూలు జిల్లా' టిడిపి అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మకు ఘన స్వాగతం...1
- Post by మేకల మాల్యాద్రి1
- గోవిందా హరి గోవిందా..! పాలకొల్లులో.. వేకువ ఉదయాన... గోవింద స్వాముల ప్రయాణం #palakollu #tirumala #Tirupati #bhakti #devotional @highlight1
- it's true1
- సిద్దిపేట జిల్లాలో వ్యవసాయదారులు జాగ్రత్త గా ఉండాలి1
- ప్రజల ముందు ప్రగల్బాల కోసమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కౌన్సిల్ సభాపతి గుత్తా సుఖేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సంవత్సరం క్రితం శంకుస్థాపన చేయగా, నత్త నడక కంటే కూడా ఘోరంగా, హీనంగా చిట్యాల లోని ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణం సాగుతోందని, దీని కారణంగా పట్టణ ప్రజలు ఉపయోగించే సర్వీస్ రోడ్లనే హైవే రోడ్లుగా మరల్చడం, అవి ట్రాఫిక్ ధాటికి, మోకాలి లోపలికి గుంతలు ఏర్పడడం, ప్రతి వాహనం టైర్లు ఎగిరిపడి, తీవ్ర ప్రమాదానికి గురవుతూ పట్టణ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని, విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికార గణం గొప్పలకు పోయి, నిధులు లేకుండా పనులు ప్రారంభించి పట్టణ ప్రజలను, హైవే ప్రణ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది సహించలేని అంశమని, సంక్రాంతి పండుగ సందర్భంలో ఈ ట్రాఫిక్ మరింత పెరగనుందని, తక్షణం ఈ రోడ్డు నిర్మాణానికి తగిన నిధులను మంజూరు చేసి, గుత్తేదారు ద్వారా త్వరగా ఈ పనులను ముగించాలని, లేనిచో తీవ్రంగా పోరాడవలసి వస్తుందని" ప్రజా పోరాట సమితి (పిఆర్పిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి హెచ్చరించారు.* *ఈరోజు చిట్యాల తహసిల్దార్ కార్యాలయం ముందు ప్రజా పోరాట సమితి (పిఆర్పిఎస్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.* *ఈ ధర్నాలో పిఆర్పిఎస్ నాయకులు నాగేళ్ల యాదయ్య, ఉయ్యాల లింగస్వామి, బర్రె సంజీవ, జిట్ట వెంకన్న, చిత్రగంటి నవీన్, పురం రాంబాబు, గడ్డం రాములు, గాద శ్రీహరి, బైరు వెంకన్న గౌడ్ మరియు ప్రజలు పాల్గొన్నారు.* *ధర్నా అనంతరం తహసిల్దార్ కు మెమొరాండాన్ని అందజేశారు*1
- మాటా.. మంతీ..! సలహాలు.. సూచనలు.. ప్రియతమ మంత్రి శ్రీ రామానాయుడు తో...!! చించినాడ సొసైటీ చైర్మన్ శ్రీ సత్యనారాయణ రాజు #palakollu #NimmalaRamaNaidu #TDP1